సుజనా చౌదరి .. టీడీపీలో కీలక నేత. టీడీపీ పార్టీ ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి కీలక పాత్ర పోషించారు. తెరెవనుక మొత్తం కార్యక్రమాల నిర్వహణ ఆయనదే. ట్రబుల్ షూటర్ పాత్ర ఆయనదే. పార్టీకి ఆర్థిక పెట్టుబడులు ఆయనవే. ఆ కృషికి తగినట్లే ఆయన ఎంపీ అయ్యారు. కేంద్రంలో మంత్రి అయ్యారు. కానీ తెలుగుదేశంలో లోకేష్ నాయుడు ప్రాధాన్యత పెరుగుతున్న కొద్దీ సుజన పాత్ర తగ్గుతూ వచ్చింది.


అదే సమయంలో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసారు. మరోపక్క పలు ఆర్థిక నేరాల ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో ఆయన మౌనంగా వుండిపోయారు. లేటెస్ట్ గా ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ పరాభవం పాలయిన తరువాత, ఆ పార్టీకి చెందిన కీలకనేత తొలిసారి ఇలా మాట్లాడడం ఇధే ప్రథమం.


ఒక్క ప్రశ్నకు కూడా తొణకకుండా, బెణకకుండా సమాధానాలు ఇచ్చారు సుజన చౌదరి. తెలుగుదేశంలో వుంటూ, చంద్రబాబు అభిప్రాయాలు సరికావు, అన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన ఏకైక నాయకుడు అనుకోవాలి. మోడీ వల్ల భారతదేశానికి పేరు పెరిగింది అని చెప్పడం, మోడీ పొత్తు దూరం చేసుకోవడం సరికాదు అనడం, మోడీ, పవన్ గత ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి సాయం పట్టారని చెప్పడం, ఈసారి కూడా మోడీతో వుండి వుంటే కేక్ వాక్ అయ్యేదని చెప్పడం సుజనకే చెల్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి: