రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి రావడం కోసం చిత్ర,విచిత్ర వ్యూహాలు అవలంబిస్తుంటాయి.అవి అప్పుడప్పుడూ మాత్రమే ఫలిస్తుంటాయి.అలాంటి వ్యూహాలను రచించి ప్రతి పక్షాలను చిత్తు చేసే బాబు గారు ప్రస్తుతం అవలంబిస్తున్న తీరు చూసేవారికి కొడుతుంది బోర్ అంటున్నారు. 
 
బాబు గారి మీద అభిమానం ఉన్న కొన్ని మాధ్యమ ప్రసారాలు ఎప్పుడూ బాబు గారిని హీరోగా చిత్రీకరించడానికి అబద్ధాలను ప్రచురిస్తూ ఉంటాయి.వాటిని ప్రజలలోకి తీసుకువెళ్ళడానికి పార్టీ కార్యకర్తలు పని చేస్తూ ఉంటారు.గతంలో ఫలించిన వ్యూహాలు ఇప్పుడు ఫలించుటలేడు అందుకే 2019 ఎన్నికలలో టీడీపీ దారుణ ఓటమి చూడాల్సి వచ్చింది.

అయనప్పటికీ ఆ పార్టీ నాయకులు అదే వ్యూహం తో ముందుకు వెళ్తున్నారు.అసెంబ్లీ లో బాబు గారు కూడా అధికార పక్షం అడిగే ప్రశ్నలకు అబద్ధాలు సమాధానాలగా చెబుతున్నారు.దీనికి తోడు అధికార పక్షం ప్రశ్నలకు పార్టీ లో బాబు గారు,అచ్చెన్న నాయుడు,బుచ్చెయ్య చౌదరి తప్ప మరో నాయకుడు లేచి సమాధానాలు చెప్పే పరిస్థితి కనిపించట్లేదు.

టీడీపీ బయటకు గంభీరంగా కనిపిస్తున్నా లోపల చాలా లోపాలు ఉన్నాయి.వారు తమ తీరును వ్యూహాలను మార్చుకోకుంటే రానున్న కాలంలో వారికి మరిన్ని కష్టాలు తప్పవని అనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: