మన సమాజంలో ఈ మద్య మానవ మృగాలు..కామాంధులు సంచరిస్తున్నారు..అడవిలో జీవించే కృర మృగాల కన్నా దారుణంగా తయారవుతున్నారు.  ముఖ్యంగా ఆడవారిపై కృరంగా అత్యాచారాలకు తెగబడుతున్నారు..మరీ దారుణమైన విషయం ఏంటంటే..చిన్నారులు, వృద్ద మహిళలను కూడా వదలడం లేదు.  తాజాగా తెలంగాణలోని హన్మకొండలో ఓ మానవమృగం రెచ్చిపోయాడు.. నిద్రిస్తున్న 9 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లిన ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ కామాంధుడి దాడిలో చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడం..తర్వాత చనిపోవడం జరిగింది.  వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కుమార్ పల్లిలో పాప తన తల్లిదండ్రులతో కలిసి ఇంటిపై నిద్రిస్తోంది. పక్కనే నివాసం ఉంటున్న ప్రవీణ్ అనే కామాంధుడు ఉదయాన్నే పాప నిద్రపోతుండగా ఆమెను ఎత్తుకెళ్లాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

తీవ్ర రక్తస్రావం అయిన చిన్నారి  స్పృహ కోల్పోవడంతో..చనిపోయిందని అనుకుని అక్కడి నుంచి పరారు అయ్యాడు. పాప కనిపించడం లేదని తల్లిదండ్రులు, బంధువులు గాలిస్తున్న సమయంలో చెట్ల పొదల్లో విఘతజీవిగా ఆ చిన్నారి కనిపించింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఒక్కగానొక్క కుమార్తె చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ కామాంధుడిని వెంటనే ఉరి తీసి చంపేయాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: