జగన్. జగన్..జగన్. కళ్ళు మూసిన తెరచినా జగనే కనిపిస్తున్నాడు పచ్చదళానికి, జగన్ పేరు అయిదేళ్ళు జపించారు. ఇపుడు మరింతగా తలచుకుంటున్నాడు. బంపర్ మెజారిటీతో అధికారాన్ని జనం జగన్ కి కట్టబెట్టారు. బేఫికర్ గా జగన్ పాలన చేసుకుంటూ పోతున్నారు. అవినీతి, అక్రమాలను భరించను, సహించను అంటూ జగన్ డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. 


ఇదే ఇపుడు పసుపు తమ్ముళ్ళను కలవపెడుతోంది. టీడీపీ హయాంలో టన్నుల కొద్దీ అవినీతి భాగోతాలు ఉన్నాయి. అవి చెరిపేస్తే చెరిగిపోవు. జగన్ సైతం వాటిని జాగ్రత్తగా తవ్వి తీసే పనిలో ఉన్నాడట. వీటికి ముందు అన్నట్లుగా అధినాయకుడు చంద్రబాబునే కదిపేసే వ్యవహారమొకటి చేసేందుకు వైసీపీ సర్కార్ సిధ్ధపడుతోంది. అసెంబ్లీ తొలి సమావేశాలు ముగిసాయి. వచ్చే నెలలో కానీ బడ్జెట్ మీటింగ్ ఉండదు.


దానికీ దీనికీ మధ్య ఉన్న కాలాన్ని హ్యాపీగా  వాడేసుకుని సంచలన నిర్ణయాలు తీసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారని టాక్. అదేంటంటే. ఇప్పటికిపుడు చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట భవనాన్ని కూలేయడమన్నమాట. దాని మీద జగన్ సర్కార్ బాగా పట్టుదలగా ఉంది. నదిని పూడ్చేసి కట్టిన ఆ అక్రమ కట్టడం కూల్చాల్సిందేనని విజయసాయిరెడ్డి అంటున్నారు. అది తప్పదు అని కూడా హెచ్చరిస్తున్నారు.


నిన్నటికి నిన్న ఇదే విషయాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి కూడా చెప్పారు. చంద్రబాబు నివాసాన్ని తప్పనిసరిగా  కూలగొడతామని ఆయన పక్కా క్లారిటీగా చెప్పేశారు. ఇక ఇపుడు విజయసాయిరెడ్డి కూడా చెప్పడంతో ఈ విషయంలో జగన్ రాజీలేని ధోరణిలో ముందుకు సాగుతారని అంటున్నారు. అదే జరిగితే తాను ప్రేమించిన అమరావతిలో చంద్రబాబుకే నిలువ నీడ లేకుండా పోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: