నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణ రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు .  ఈ క్రమంలో  బుధవారం స్వామివారికి వైభవంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు . 


స్వామి వారు  ఉభయ దేవేరులతో కలిసి  ప్రత్యేక అలంకారంలో రథంపై ఆశీనులైన భక్తులకు దర్శనమిచ్చారు . స్వామివారి రధాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు . కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు .


వేద పండితుల ఆధ్వర్యంలో   మంగళవాయిద్యాల నడుమ సాంప్రదాయబద్ధంగా రథోత్సవం నిర్వహించారు . భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: