టీడీపీ, వైసీపీ వైరి పక్షాలు. ఒకరంటే ఒకరికి పడదు, రాజకీయ ప్రత్య‌ర్ధులు. బలమైన పొరాటాలు చేసుకునే వారు. మరి ఈ ఇద్దరి మధ్య సఖ్యత ఉంటుందా. ఢీ అంటే ఢీ కొట్టే చోట ఒకే మాట అవుతుందా. తెలుగుదేశం మనసులో ఉన్నది వైసీపీ చేస్తుందా.


అంటే చేస్తుంది అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్ రామక్రిష్ణారెడ్డి. ఆయన రాజధాని గురించి కీలకమైన అంశాన్నే చెప్పారు. అమరావతి రాజధాని ఎక్కడికీ పోదని, అది అలాగే ఉంటుందని గట్టి హామీ ఇచ్చేలా మాట్లాడారు. తాము రాజధానికి వ్యతిరేకం కాదని కూడా పక్కా క్లారిటీ ఇచ్చేశారు. తాము రాజధాని రైతుల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పారు.


రాజధాని కాబట్టే జగన్ తాడేపల్లిలో సొంత ఇల్లు కట్టుకున్నారని కూడా ఆర్కే లాజిక్ పాయింట్ చెప్పుకొచ్చారు. తాము రాజధాని విషయంలో రెండో మాట లేకుండా అభివ్రుధ్ధి చేస్తామని చెప్పడం నిజంగా తెలుగుదేశం తమ్ముళ్లకు మంచి మాట. చెవులకు ఇంపు అయిన మాట. రాజధాని అక్కడ వస్తుందని తెలిసే అంతా కలసి భూములను కారు చౌకగా కొనుగోలు చేశారు. ఇపుడు కోట్లకు పడగలెత్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: