వైసీపీ సర్కార్ అధికారంలోకి రావడం కాదు కానీ తమ్ముళ్లు జడుసుకుంటున్నారు. టీడీపీకి ఎదురులేదని భావించి ఓ రేంజిలో అయిదేళ్ల పాటు అధికారాన్ని బాగానే వాడేసుకున్నారు. తమకు ఏపీలో రాజకీయ ప్రత్యర్ధే లేడని గొప్పలు పోయారు. ధీమా పడ్డారు. చివరకి ఎన్నికల్లో చతికిలపడ్డారు.


సరే ఇదంతా ఎందుకంటే విశాఖ జిల్లా మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు మెడ మీద కత్తిని వేలాడతీసేందుకు వైసీపీ ఇపుడు తయారుగా ఉంది. విశాఖ భూ కుంభకోణంపై సిట్ విచారణ చేసిన నివేదిక బయట పెడతామని జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు గట్టిగానే  ప్రకటించారు. ఇందులో దోషులుగా తేలితే ఎంతటి పెద్ద వారు ఉన్నా సరే వారిని శిక్షించి తీరుతామని క్లారిటీగా చెప్పాక గంటా బ్యాచ్ కి నిద్ర పడుతుందా అని.


మూడేళ్ళ క్రితం ఏపీ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన  అతి పెద్ద కుంభకోణం ఈ  భూ కుంభకోణం. దీనిలో మంత్రి అనుచరులు భారీ ఎత్తున లాండ్ స్కాం కి పాల్పడ్డారని ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. దీని మీద అంతా కలసి ఆందోళన చేశాక చివరికి చంద్రబాబు సర్కార్ సిట్  ని నియమించింది. నివేదికను సైతం బయటపెట్టకుండా దాచేసింది. ఇపుడు తీగ లాగుతామని డొంకను సైతం కదిలిస్తామని మంత్రి అవంతి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: