ఈమధ్య తెలుగు రాజకీయాల్లో జాతకాలు, జ్యోతిష్యులు, స్వామీజీల ప్రభావం ఎక్కువగా ఉంది. ఎన్నికల ముందు అయితే ఈ గోల చాలా ఎక్కువ. జనం కూడా ఫ్యూచర్ పై ఆసక్తి తో ఎవరు ఏం చెప్పినా వినేవారు.

 

ఎన్నికల తర్వాత కూడా కొందరు జ్యోతిష్యులు సందడి చేస్తున్నారు. వారిలో వేణు స్వామి ఒకరు. ఈయన ఎన్నికల ముందు కూడా జగన్ గెలుస్తాడు అని ఘంటాపథంగా చెప్పాడు. తాజాగా ఆయన ఓ వింత విషయం బయట పెట్టారు.

 

అదేమిటంటే..చంద్ర బాబు జాతకం వేణు స్వామి వద్ద మాత్రమే ఉందట. ఎందుకంటే.. ఆయన చంద్ర బాబు తల్లి బ్రతికి ఉన్నప్పడు.. ఆమె తో మాట్లాడి చంద్ర బాబు అసలు పుట్టిన సమయం తెలుసుకున్నాడు. అందుకే తను చెప్పినంత కరెక్ట్ గా బాబు జాతకం ఎవరూ చెప్పలేరని ధీమాగా చెబుతున్నారు.

 

అసలు సిసలు చంద్ర బాబు జాతకం తనకు ఒక్కడికే తెలుసు అంటున్నాడు వేణు స్వామి.అందుకే మిగిలిన వారంతా ఎన్నికల ఫలితాలపై సరిగ్గా జోస్యం చెప్పలేక పోయారని వేణు స్వామి చెబుతున్నారు.మరి ఈయన వాదనలో నిజమెంతో ?

మరింత సమాచారం తెలుసుకోండి: