వైసీపీ మొన్నటి అసెంబ్లీ  ఎన్నికల్లో బంపర్ మెజారిటీ తో గెలిచింది.. ఓకే.. కానీ ఆ గెలుపు కొందరు నేతల్లో అహంకారం తీసుకొచ్చిందని అంటున్నారు. టిడిపి కార్య కర్తలపై దాడుల అంశం ఇప్పటికే రచ్చ అవుతోంది.

 

ఈ సమయంలో ప్రకాశం జిల్లాలో కొందరు వైసీపీ నాయకుల ప్రవర్తన పై పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. టిడిపి కి ఓటు వేసారన్న కారణంతో కొత్తగా వేసిన రోడ్డు ను జెసిబి లతో తవ్వించారు అన్నది ఆ కథనాల సారాంశం. ఇదీ నిజమైతే వైసీపీ నేతల ప్రవర్తనను ఖండిచాల్సిందే.

 

అధికార పార్టీకి చెందిన వారం అన్న అహంకారం తలకు ఎక్కితే ప్రజలు తిరస్కరించే ప్రమాదం ఉంటుంది. జనం మంచి మెజార్టీ తో విజయం అందించినప్పుడు.. దాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. ఇక ఇలాంటి ఓవర్ యాక్షన్ చర్యలతో అది మరింత కష్టం అవుతుంది.

 

అయితే వైసీపీ పై బురద జల్లెందుకు యెల్లో మీడియా ఎప్పుడూ సిద్ధంగానే  ఉంటుంది. ఇలాంటి ఘటనలను మరింత మసాలా జోడించి ప్రజల్లోకి వదులుతుంది. అందుకే ఇలాంటి పోకడలు మొగ్గలోనే తుంచడం వైసీపీ కి మేలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: