తెలుగుదేశం పార్టీలో మహా సంక్షోభం నెలకొంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆ పార్టీ నేతలంతా బిజెపి వైపు చూస్తున్నారు. ఇప్పటికే టిడిపి రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీని వీడి బిజెపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక రాష్ట్రంలోనూ తెలుగుదేశం నేతలు వైపు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని వారు ఆలోచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయాన్ని క్యాష్ చేసుకునేందుకు అనుగుణంగా బిజెపి అగ్రనేతలు తెలుగుదేశం పార్టీని ఖాళీ చేసేందుకు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు.
బిజెపి నేతల జోరు చూస్తుంటే చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యేలా ఉంది. చంద్రబాబు కుడి , ఎడమ భుజాలుగా భావించే నేతలు కూడా బీజేపీకి క్యూ కట్టడం చూస్తే తెలుగుదేశం పార్టీలో ఇక మిగిలేది ఎవరో అర్థం కాకుండా ఉంది.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన బిజెపి నేతలు కూడా ఇదే విషయం చెబుతున్నారు. చంద్రబాబు విదేశాల నుంచి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమని ధీమాగా చెబుతున్నారు.