అదేంటో టీడీపీ జాతకం ఒక్క చంద్రబాబుకు తప్ప అందరికీ కళ్ళ ముందు కనిపిస్తోందా. టీడీపీ ఏపీలో శాశ్వతం అని చంద్రబాబు చెప్పుకున్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాల మూలంగానే ఆయన కళ్ల ముందే పార్టీ దారుణంగా పతనం అవుతోంది. అయితే ఇంకా టీడీపీతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు చంద్రబాబు.


ఇదిలా ఉండగా తాను ఏ పార్టీలో చేరే ప్రసక్తి లేదని మాజీ ఎంపీ, సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి లేటెస్ట్ గా  చెప్పారు. ఏపీలో  తాజా రాజకీయాలపై ఆయన మాట్లాడుతూ, టీడీపీ మునిగిపోతున్న నావ అని తేల్చేశారు. తానున్న పార్టీ పరిస్థితి అసలు బాగోలేదని తనకు కూడా తెలుసు అంటూ హాట్ కామెంట్స్ చేశారు.


అయితే ఇంత జరిగినా తాను టీడీపీని వీడబోనని జేసీ చెప్పారు. తాను బీజేపీలో చేరుతానని వస్తున్న వార్తలు పూర్తిగా తప్పు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఏపీలో బీజేపీ బలపడుతుందా లేదా  అన్నది కూడా ఇపుడే ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు. బీజేపీకి ఏపీలో ఎదుగుదల లేదన్నది తన అభిప్రాయంగా చెప్పిన ఆ పెద్దాయన తాను మాత్రం టీడీపీలోనే రాజకీయాల్లో ఉన్నంతవరకూ ఉంటానని స్పష్టంగా చెప్పేశారు. మరి జేసీ కామెంట్స్ మీద బాబు నవ్వాలో, బాధపడాలో తెలియడంలేదంటున్నారు తమ్ముళ్ళు.


మరింత సమాచారం తెలుసుకోండి: