*బోల్ ఇండియా బోల్ - చేదు నిజాలు*

రైతులు పొలంలో - రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు,

కానీ...

నాయకులు దేశంలో, వారి సంతానం విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు.

*చేదు నిజం ఏమంటే*, ఈ దేశ వాసులమైన మనం ఇక్కడ  పి.హెచ్.డి, గ్రాడ్యుయేషన్,  మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లం,

టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటు వేసి, నేతలుగా ఎన్నుకొని, వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుంటాం.

*ఆలోచించండి*.

రాజకీయ నేతలు కావాలనుకొనే వాళ్ళు ఐదు సంవత్సరాలు సైన్యంలో ఖచ్చితంగా పనిచేసి  తీరాలన్న నిబంధన పెడితే,దేశంలో 80 శాతం ఉత్పాతాలు (దరిద్రాలు) వాటంతట అవే సర్దుకుంటాయి.

ఏ రోజు ప్రత్యర్థిపై దాడుల్లో నాయకులు ఛస్తారో...నేతల పంటలకు అగ్గి తగులుతుందో ఆరోజు నుంచే దేశంలో రాజకీయ దాడి- ప్రతి దాడులు అదృశ్యమవుతాయి.

*25 - 30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు  చేసిన వాళ్లకు పెన్షన్ఉండదు*.

కానీ,. ఐదేళ్లు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం *జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు* ఇస్తున్నారు.

ఇలా ఎందుకు ఇవ్వాలి? 

నాయకులపైకి చెప్పులో, కోడి గుడ్లో, నల్ల సిరానో, విసిరితే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు.

కానీ,...భారతీయ సైన్యం పై రాళ్ల దాడి చేసే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇస్తారు. ఎందుకు?

రైతుల సరుకుల వాహనాలపై తోలు వలిచి టోల్ వసూలు చేస్తున్నారు.

కాని,...మంత్రి మహాశయుల వాహనాలకు అదేమీ ఉండదు.

*రైతు తినేది దొంగ సొమ్మా?*

 *నేతలు తినేది కష్టార్జితమా?* ఇదేమి న్యాయం.

*విద్యలో రాజకీయం 100%*

*రాజకీయంలో విద్య 00%*

ఆహా ఎంత గొప్ప విధానం మన ఈ దేశంలో.

ఇందుకేనేమో రాజకీయం అంతా చెత్త తో నిండిపోయింది.

దేశంలోని ప్రతిభావంతులేమో...వలస పక్షులు అవుతున్నారు.

దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, ధర్మాసుపత్రుల్లో పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి -

వారి రోగాలకు చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి...అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం.

*₹399 కి అపరిమిత కాల్స్* డేటా దొరుకుతుంటే ప్రజాప్రతినిధులకు నెలసరి *₹15000 టెలిఫోన్ బత్తా ఎందుకు?*

*ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే కోట్ల రూపాయలను ఇలా వృధాగా ఖర్చుచేయడం అవసరమా?*

అందరూ ఆలోచించాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: