చంద్రబాబునాయుడుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా షాక్ ఇచ్చింది. చంద్రబాబు ఎంతో ఇష్టపడి కట్టించుకున్న అక్రమ కట్టడం ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంది. గడచిన ఐదేళ్ళల్లో ఓ అక్రమ కట్టడాన్నే తన క్యాంపు ఆఫీసుగా మార్చుకోవటమే కాకుండా ప్రభుత్వంతోనే మరో అక్రమ కట్టడాన్ని చేయించిన ఘనుడు చంద్రబాబు.

 

మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత అక్రమ నిర్మాణాల నుండి ఖాళీ చేయకపోగా ప్రజావేదికను కూడా తనకే కేటాయించమని అడగటమే విచిత్రం. అయితే ప్రభుత్వం ఏమీ రెస్పాడ్ కాలేదు. అయితే హఠాత్తుగా శుక్రవారం ప్రజావేదికను స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రకటించటమే కాకుండా తన ఆధీనంలోకి తీసేసుకున్నది.

 

అందులో ఉన్న ఫర్నీచర్ ఏమైనా ఉంటే వెంటనే దాన్ని తీసుకెళ్ళాలంటూ టిడిపికి నోటీసులు కూడా పంపింది. ఇపుడు ప్రజా వేదికను స్వాధీనం చేసుకున్నదంటే రేపో మాపో చంద్రబాబు నివాసముంటున్న మరో అక్రమ కట్టడాన్ని కూడా స్వాధీనం చేసుకోవటం ఖాయమనే అర్ధమైపోతోంది.

 

కరకట్టపై నిర్మించిన అన్నీ అక్రమ కట్టడాల్ని కూల్చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాకపోతే కోర్టులో ఓ నిర్మాణంపై  పిటీషన్ విచారణ జరుగుతోంది కాబట్టి జాప్యం జరుగుతోంది. మొత్తానికి విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: