* ఆంధ్రప్రదేశ్‌లో స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు పోస్కో సుముఖత
* ఏపీ సీఎం జగన్‌తో కంపెనీ సీఈవో భేటీ
* త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్న కంపెనీ ప్రతినిధులు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన దగ్గరి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫుల్ బిజీగా ఉన్నారు. వివిధ రంగాలకు చెందిన అధికారులతో చర్చలు జరుపుతూ రాష్ట్ర పరిస్థితులను త్వరితగతిన తెలుసుకుంటున్నారు. 


అదేసమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు, రాష్ట్ర అభివృద్ధికి తగిన ప్రణాళికలను రూపొందిస్తూ తీరికలేని షెడ్యూల్‌తో ముందుకు కదులుతున్నారు. ఈ దిశగానే రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు.


ఈ క్రమంలోనే దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచంలోని ఐదో అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ పోస్కో తాజాగా జగన్మోహన్ రెడ్డిని కలిసింది. కంపెనీ సీఈవో బాంగ్‌ గిల్‌ హో బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉక్కు ప్లాంటు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.


ఇందుకు సీఎం వైఎస్‌ జగన్‌ సానుకూలముగా స్పందించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: