- MLC బుద్ధ వెంకన్న కామెంట్స్::
తెలుగుదేశం పార్టీని ఫిరాయించి వెళ్లిన రాజ్యసభ సభ్యుల చేష్టలు వికృతంగా ఉన్నాయి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నన్ను బెదిరింపులు చేస్తున్నాడు. సుజనా చౌదరి ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి హెచ్చరించారు. కేసులు పెట్టించి నీ బోల్టులు తిప్పిస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాజ్యసభ సభ్యులు గురించి మాట్లాడకుండా నాకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. బయపడటానికి నేను తప్పుడు పనులు ఏమి చేయలేదు. అధ్యక్షుడు సూచనతో క్రమశిక్షణ తో పని చేసిన వారిలో నేను ముందుంటాను.


ప్రజల సంక్షేమం కోసం తుదిశ్వాస వరకు పోరాడతాం. నన్ను బెదిరింపులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిజిపీ ని రేపు కలుస్తాం.  
ప్రజాస్వామ్య వ్యవస్థలో వీరి లాంటి నాయకులు కి స్థానం లేదు. ప్రజలు వీళ్ళలాంటి నేతలను బహిష్కరణ చేయాలి. 


వర్ల రామయ్య కామెంట్స్::
నైతికత ఉంటే రాజీనామా చేసి ఎంపీ లు బీజేపీ లోకి వెళ్ళాలి. సుజనా చౌదరి మీద అనేక ఆర్ధిక పరమైన కేసులు ఉన్నాయి. శరణు కోరి బీజేపీలోకి వెళ్లి ఇప్పుడు టీడీపీ నేతలను విమర్శించడం దారుణం. 



మరింత సమాచారం తెలుసుకోండి: