తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఇలాంటి పరిస్థితి టీడీపీకి ఎప్పుడూ వచ్చి ఉండదేమో.2019 ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు, ఆరుగురు ఎంపీలలో నలుగురు బీజేపీలో చేరటం , టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించబోతున్నారని వార్తలు రావడంతో టీడీపీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడింది. 2024ఎన్నికలలోపు టీడీపీ పుంజుకుంటుందో ఇంకా బలహీనపడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. 
 
నిజానికి ఈ పరిస్థితికి కారణం చంద్రబాబే. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని చంద్రబాబే ఈ పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టాడు. ఈ పార్టీ ఫిరాయింపులపై ఎన్ని విమర్శలు వచ్చినా తెలుగుదేశం పార్టీ వైసీపీ 23 మంది ఎమ్మెల్యేలను పార్టీ లోకి చేర్చుకుంది. ఇప్పుడు టీడిపీ అధికారంలో లేకపోవటంతో తెలుగుదేశం పార్టీలో కూడా ఈ పార్టీ ఫిరాయింపుల పర్వం మొదలైంది. 
 
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంది. చంద్రబాబు ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది. మరి చంద్రబాబు ఏం చేస్తాడో చూడాలి. పార్టీలోని మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారకుండా ఎలా కాపాడుకుంటాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: