తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీలు నలుగురు బీజేపీలోకి ఫిరాయించారు. చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉండగా ఇదంతా జరిగింది. కానీ ఇదంతా చంద్రబాబు నాయుడు ప్లాన్ ప్రకారమే జరుగుతుందని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు పథకం ప్రకారమే టీడీపీ నుండి బీజేపీలోపీ ఎంపీలను పంపినట్లు అనిపిస్తుంది. 
 
నిజానికి పార్టీ మారిన ఎంపీలు ఎవరూ చంద్రబాబుపై విమర్శలు చేయట్లేదు. బీజేపీలో చేరి కూడా సుజనా చౌదరిలాంటి వాళ్ళు టీడీపీ మరలా పుంజుకోవాలని ఆశిస్తున్నామని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఏదో మొక్కుబడిగా విమర్శలు చేస్తున్నా ఘాటైన విమర్శలు మాత్రం చేయట్లేదు. 
 
సీఎం రమేశ్ , సుజనా చౌదరి లాంటి వాళ్ళకు చంద్రబాబే రాజకీయ గురువు. టీడీపీ తరపున చేరిన ఎంపీలు బీజేపీలో చేరినా టీడీపీకి కోవర్టులుగా పనిచేసే అవకాశం లేదు. మరి వీళ్ళు టీడీపీ కోవర్టులో లేక రాజకీయ, వ్యాపార అవకాశాల కోసం పార్టీ మారారో కొద్దికాలం వేచి ఉంటే తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: