ఈ మద్య మహిళలపై ప్రతిరోజూ ఎక్కడో అక్కడ అత్యాచారాలు జరుగుతున్న వార్తలు చదువుతూనే ఉన్నాం. మొన్న దారుణంగా 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి చంపిన ఓ మానవ మృగం గురించి చదివాం..కొంత కాలంగా నిర్మాణుష ప్రదేశాల్లో ప్రేమికులపై కామాంధులు దాడులు చేయడం డబ్బులు, నగలు తీసుకోవడమే కాదు బాయ్ ఫ్రెండ్స్ ని చితకబాది అమ్మాయిలపై అత్యాచారాలు చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి.
తాజాగా తమిళనాడులోని విళుప్పురంలో దారుణం జరిగింది. ప్రేమికులపై దాడిచేసిన దుండగులు యువకుడిని చితకబాది యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..నల్లూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న కండమంగలం ప్రాంతానికి చెందిన యువతి, సూరమంగళానికి చెందిన యువకుడు ప్రేమించుకుంటున్నారు.
గురువారం రాత్రి వీరు నల్లూరు రైల్వే గేట్ సమీపంలోని పల్లిచ్చేరి వద్ద నిర్మాణుష ప్రదేశంలో మాట్లాడుకుంటున్న సమయంలో నలుగురు కామాంధులు మద్యం సేవించి వారి వద్దకు వచ్చారు. వారిని చూసి ఆ జంట పారిపోయే ప్రయత్నం చేయగా చుట్టు ముట్టి అమ్మాయిని ప్రియుడి ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగుల బారి నుంచి తప్పించుకున్న యువకుడు ఫోన్లో తన స్నేహితుడికి సమాచారం ఇవ్వగా అతడు రావడంతో ఆ కామాంధులు అక్కడ నుంచి పారిపోయారు.
అప్పటికే స్పృహ తప్పి పడిపోయిన యువతిని స్థానికుల సహాయంతో యువకులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకడైన అయ్యనార్ (27)ను అరెస్టు చేశారు. మిగతా ముగ్గరు పరారీలో ఉండగా త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.