టీటీడీ కొత్త ఛైర్మన్ గా ఏపీ సీఎం వైఎస్ జగన్మౌోహన్ రెడ్డి బాబాయి వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. తిరుమలలో ఎవరైనా కోరిక తీరినప్పుడు తులాభారం వేయిస్తానని మొక్కుకోవడం సంప్రదాయం.. వివిధ రకాల పూజద్రవ్యాలతో ఈ తులాభారం వేయించుకుంటారు.

టీటీడీ కొత్త ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాత్రం నెయ్యితో తులాభారం వేయించుకున్నారు. ఇందులో పెద్ద విశేషం ఏమీలేదు. కానీ వైవీకి తులాభారం వేసిన నెయ్యి హెరిటేజ్ కంపెనీ నెయ్యి కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 

హెరిటేజ్ కంపెనీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుకు చెందినది కావడమే ఈ చర్చలకు అసలు కారణం. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో హెరిటేజ్ ఉత్పత్తులు విరివిగా వాడేవారని ఆరోపణలు ఉన్నాయి. అనేక ప్రభుత్వ సంస్థలు హెరిటేజ్ ఉత్పత్తులను కావాలనే ఆర్డర్ చేస్తాయని విమర్శలు ఉన్నాయి. 

ఇప్పుడు ఏకంగా టీటీడీ కొత్త ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. తమకు ఏమాత్రం గిట్టని చంద్రబాబుకు చెందిన కంపెనీ నెయ్యితో తులాభారం ఎందుకు వేయించుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది. కావాలనే హెరిటేజ్ నెయ్యి వాడారా.. లేక.. కాకతాళీయంగా అలా జరిగిపోయిందా అన్నది అర్థంకాని విషయం. ఏదేమైనా ఈ ఫోటో మాత్రం బాగా వైరల్ అవుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: