విజయసాయి రెడ్డి వైకాపాలో స్పీడ్ గా ఎదుగుతున్న నేత.  జగన్ కు నమ్మిన బంటు.  పార్టీకి సంబంధించిన ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు.  అందుకే జగన్ కు అత్యంత ఆప్తుడు అయ్యాడు. ప్రస్తుతం విజయసాయి రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  


ఇదిలా ఉంటె విజయసాయి రెడ్డికి ఇప్పుడు మరో ముఖ్యమైన పదవిని అప్పగించారు జగన్.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతినిధిగా విజయసాయి రెడ్డిని నియమిస్తూ ఉత్తరువులు జారీ చేశారు.  ఇది క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ కావడంతో... విజయసాయి రెడ్డి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.  


జగన్ అప్పగించిన పదవిని బాధ్యతతో నిర్వర్తిస్తానని చెప్పారు.  జగన్ అధికారంలోకి వచ్చాక.. నమ్మకస్తులకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తునే.. పార్టీకి విధేయులుగా ఉన్న వాళ్లకు మంత్రి పదవులు ఇస్తున్నారు.  దీంతోపాటు జగన్ పాలన విషయంలో దూకుడుగా ఉంటున్నాడు.  


ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు జగన్ కృషి చేస్తున్నారు.  నవరత్నాలను అమలు చేసేందుకు జగన్ అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  జగన్ చేపట్టిన ప్రతి పధకం అమలు జరిగేలా ట్రై చేస్తున్నారు జగన్.  


మరింత సమాచారం తెలుసుకోండి: