వరంగల్ జిల్లాలో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసిన ఘటన మరిచిపోకముందే తెలుగు రాష్ట్రాల్లో మరో దారుణం వెలుగు చూసింది. ప్రకాశం జిల్లాలో ఓ బాలికను ఆరుగురు దాదాపు పది రోజులుగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన అందర్నీ హతాశయులను చేస్తోంది. 


వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాలోని ఓ హాస్టల్ లో ఉండే ఓ బాలికకు ఓ కారు డ్రైవర్ తో పరిచయమైంది. అతని కోసం హాస్టల్ నుంచి బయటకు వచ్చిన ఆ బాలిక.. అతని కోసం ఒంగోలు వచ్చింది.  బస్టాండ్ లో వేచి ఉంది. ఇది గమనించిన ఓ వికలాంగుడు.. ఆటో డ్రైవర్ ను కలిపిస్తానంటూ ఆమెకు మాయమాటలు చెప్పిన తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. 

ఆ బాలికను అక్కడి నుంచి మరో గదికి మార్చి.. అక్కడ మరో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా అత్యాచారం చేశారు. దాదాపు పది రోజులుగా ఆమెకు నరకం చూపించారు. ఆ కామాంధుల నుంచి ఎట్టకేలకు ఆ బాలిక బయటపడి.. బస్టాండ్ కు చేరి..ఏడుస్తూ కూర్చోగా ఓ కానిస్టుబుల్ గమనించి వివరాలు సేకరించారు. 

ఊరు కాని ఊరు వచ్చి కామాంధుల చేత చిక్కిన ఆ బాలికను పోలీసులు చేరదీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను మోసగించిన వికలాంగుడిని.. అతడిచ్చిన సమాచారంతో ఇంజినీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కామాంధులను కఠినంగా శిక్షించాలని మహిళాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: