సినిమా ఇండస్ట్రీలో టాప్ నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు. ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ నిర్మాత. ఒకసారి ఒక కథను ఒకే చేశారు అంటే.. ఆ కథ సినిమాగా రెడీ కావాల్సిందే. మంచి అభిరుచి కలిగిన నిర్మాతగా పేరుంది. ఈయన ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకే ఆయన బ్యానర్ పేరు కూడా శ్రీ వెనకటేశ్వర క్రియేషన్స్ పేరుతో పెట్టుకున్నారు.
ఈ బ్యానర్పై అనేక సినిమాలు చేశారు. నిర్మించిన చాలా సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి. దిల్ రాజుకు ఓ కోరిక ఉన్నది. రాజులు తలుచుకుంటే దెబ్బలకు కొదవా చెప్పండి. రాజుగారు తన మనసులోని మాటను కేటీఆర్ చెవిన పడేశారు.
ఎలాగో కేటీఆర్... తెలంగాణా వ్యక్తే.. అలాగే రాజుగారు కూడా తెలంగాణా కు చెందిన వ్యక్తే.. ప్రాంతీయ అభిమానం. కాదనలేదు. ఆయన ఓ కోరిక కోరాడు. దానిని ఎలాగైనా తీర్చే బాధ్యతను కేటీఆర్ పై పెట్టాడు. మాటిచ్చాక నిలబెట్టుకోవాలి కదా మరి.
ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ తెరాస కు సన్నిహితుడిగా మారిపోయారు. ఇంకేముంది.. జగన్ ముందు కేటీఆర్ తన ఇచ్చిన మాట గురించి చెప్పాడు. కేటీఆర్ అడిగితె కాదంటాడా చెప్పండి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. దిల్ రాజుకు ఎప్పటి నుంచో టిటిడి మెంబెర్ గా చేయాలనీ ఉందట. అది అసలు విషయం. ఆ కోరిక కేటీఆర్ ద్వారా.. జగన్ ద్వారా అలా తీరబోతుంది.