టీడీపీలో నాయకత్వ సంక్షోభం ఒక కొలిక్కి రావడంలేదు. నలుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడి బీజేపీ నాయకత్వంలోని పార్టీ తీర్ధం పుచ్చుకున్నాక ఇది ఇంకా కొనసాగుతోందే తప్ప ఆగేట్టు ఎక్కడా కనిపించడంలేదు. ఇక చంద్రబాబు విదేశాల్లో ఉండడం కూడా నేతలకు ఎక్కడ లేని ధైర్యాన్ని ఇస్తోంది.


ఈ నేపధ్యంలోకి రంగంలోకి దిగిన బీజేపీ పెద్దలకు తమ్ముళ్ల మాటలు షాక్ ఇస్తున్నాయట. పెదబాబు దేముడు, చినబాబు యువనేత అంటూ పొగిడిన నోళ్ళే ఇపుడు ఆఫ్ ది రికార్డ్ లో మాత్రం ఇంద్దరి నేతలను దారుణంగా తిడుతున్నారుట. వాళ్ళిద్దరే పార్టీని నాశనం చేశారని, వారు ఉండగా పార్టీ బాగుపడద‌ని తమ్ముళ్ళు అనడంతో ఆశ్చర్యపడడం బీజేపీ పెద్దల వంతు అవుతోందట.


ఇక ఏపీ టీడీపీలోని  మెయిన్ స్ట్రీం లీడర్లు తమకు తాముగా బీజేపీలోకి వచ్చేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చిన్న చేపలతో మొదలుపెడదామనుకుంటే పెద్ద చాపలే బీజేపీ  గేలానికి తగులుతున్నాయట. దాంతో ఏపీలో టీడీపీని ఖాళీ చేసే పని తొందరలోనే పూర్తి అవుతుందన్న గట్టి విశ్వాసంతో కమలం పార్టీ నేతలు ఉన్నట్లుగా తెలుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: