ప్రపంచం అంతా గర్వించేలా రాజధాని కడుతున్నాం, ఈ రాజధానిలో ఇల్లు లేని వారు అభాగ్యులే. ప్రతిపక్ష నేత వలస పక్షి. మేమే ఇక్కడ శాశ్వతం ఇలా సాగేది బాబోరి ప్రసంగం. ఇంతా చేస్తే అధికారం పోయాక అసలు సంగతి తెలిసింది.


ఇపుడు అమరావతిలో బాబు గారికి ఇల్లే లేదు. ప్రజా వేదిక ప్రభుత్వం సొమ్ముతో కట్టింది  తీసుకుంటే గింజుకుంటున్న తమ్ముళ్లకు అసలైన సినిమాని చూపించడానికి వైసీపీ సర్కార్ రెడీ అవుతోంది. బాబు కాపురం ఉంటున్న కరకట్ట వద్ద అక్రమకట్టడం పైన కూడా కన్నెర్ర చేస్తోంది. లింగమనేని కట్టిన ఈ అక్రమ భవనమే బాబు గారి సీఎం హోదాలో సక్రమమైంది.


ఇపుడు దాన్ని కూడా కూలగొట్టాలని వైసీపీ డిసైడ్ అయితే బాబు గారికి, అమరావతికి బంధం పూర్తిగా తెగిపోతుంది. అక్రమం సక్రమం చేయాలనుకుని ప్రజావేదిక కోసం లేఖ రాసిన బాబుకు జగన్ చుక్కలు చూపుతున్నారు. తోందరలో బాబు నివాసం కూడా లేకుండా పోతుందని వైసీపీ మంత్రులే అంటున్నారు. అపుడు బాబు గారు వందల కోట్లతో కట్టించుకున్న హైదరాబాద్ లో ఉంటారా లేక విజయవాడలో అద్దె  ఇల్లు తీసుకుంటారా చూడాలి.
 



మరింత సమాచారం తెలుసుకోండి: