ఒక పోస్టులో ఆయన, " నాకన్నా పెద్ద అభిమాని పవన్ కళ్యాణ్‌కు ఎవరూ లేరు. 2019 ఎన్నికల్లో పవన్ గెలవలేదని, మాములుగా తాగే రెండు పెగ్గులకి మరో రెండు కలిపికొట్టి నా విషాదాన్ని మిత్రులతో పంచుకున్నాను. అప్పటి నుంచీ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు మీద, జనసేన పార్టీ మీద బెంగతో చచ్చిపోతున్నాను. ఏం చేస్తే 2024 నాటికి పార్టీకి, పవన్‌కు రాజకీయపునర్జీవం వస్తుంది అనే విషయంపై నాకున్న మూడు దారుల స్ట్రాటజీ ఇక్కడ పెడుతున్నాను.

 

మొదటిది: తెలుగుదేశం పార్టీ ఎలాగూ కనుమారుగైపోతొంది గనక, ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలి అంటే, జనసేన గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుతో బలపడి. మానవవనరుల ఏర్పాటు చేసుకోవాలి. క్యాడర్ నిర్మాణం జరగాలి. జీరో బడ్జెట్ బెస్ట్ పాలిటిక్స్ అంటున్నారు గనక ప్రజల నుంచీ సానుభూతిపరుల నుంచీ తగినంత ఆర్థికవనరులు జమచేసుకోవాలి. కాపు ప్రాబల్యం ఉన్న గోదావరి జిల్లాలే కాకుండా వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాధ్ర, రాయలసీమల్లో కూడా ఫోకస్ పెట్టాలి.

 

రెండవది: బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీని లేకుండా చేసి, వాళ్ళు ప్రత్యామ్నాయం గా ఎదగాలని ఆంధ్రప్రదేశ్‌లో ట్రైచేస్తున్నారు. కానీ ఆపార్టీలో జనాకర్షణ ఉన్న నాయకులు లేరు. జనసేనకు బీజేపీ లో విలీనం చేసేసి,పవన్ కళ్యాణ్ బీజేపీ పగ్గాలు పట్టుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఆర్ధిక,మానవవనరుల గురించి ఆలోచన అవసరం లేదు. ఘర్షణ,పోరాట దీక్షలు అవసరం లేదు. ఈజీగా లైఫ్ లో సక్సెస్ఫుల్ రాజకీయనాయకుడు అయిపోతాడు.

 

చంద్రబాబు బలహీనంగా ఉన్నాడు. తెలుగుదేశం ఉంటుందో ఊడుతుందో తెలీదు. కమ్మలు తెప్పటగలేస్తున్నారు. కాపులు పార్టీని వదిలేసే ప్రమాదం కనిపిస్తోంది. లోకేష్ ను భవిష్యత్తుగా ఉహించుకోవడానికి పార్టీవాళ్లకే కష్టంగా ఉంది. ఈ టైంలో కాపుల్ని మల్లేసుకొచ్చే గొర్రెల కాపరిలా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తే...తెలుగుదేశంలో నెంబర్ టూ పొజిషన్ గ్యారంటీ. ఇప్పుడు కాకపోతే మరో పదేళ్లకు, చంద్రబాబు పోయేనాటికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి.. ఇది నా ప్రణాళిక...ఏమంటారు?

 

అంటూ కత్తి మహేశ్ చేసిన పోస్టు తీవ్ర విమర్శలకు దరి తీస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: