కోట్లకు కోట్లు డబ్బు ఉంటే.. చాలదు.. ఆ డబ్బు, దర్పం ప్రదర్శించుకోవాలి.. ఇదీ ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అందుకే కోటీశ్వరుల వేడుకల్లో హంగూ, ఆర్భాటం పెరిగిపోతున్నాయి. ఆ మధ్య గాలి జనార్దన్ రెడ్డి ఇంట పెళ్లి - వివాహ విందు బాగా చర్చనీయాంశమయ్యాయి. 


తాజాగా తమిళనాడులోని సత్య మంగళ వాసవి జ్యువెలర్స్ యజమాని కూతురి పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ  పెళ్ళి విందులో బంగారు పళ్ళేలలో అతిధులకు వంటలు వడ్డించారట. బంగారు పళ్లేలలను వెండి పీటలపై పెట్టి విందు భోజనం పెట్టారట. 

అంతేనా.. అతిధులకు విందు ఇచ్చే ముందు.. ఒక్కొక్కరికి ప్రత్యేకంగా హారతి ఇచ్చారట. హారతి ఇచ్చిన తర్వాత బంగారు గొలుసులను బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో ఎంతవరకూ వాస్తవమన్నది మాత్రం తెలియదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: