మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నేను పార్టీ మారను అంటున్నా ఆయన మీద అనుమానపు చూపులు మాత్రం పోవడంలేదు. గంటా ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి. ఆయన ఇప్పటికి మూడు పార్టీలు మారడంతో డౌట్లు పుట్టుకొస్తున్నాయి. గంటా అధికార  వియోగాన్ని సహించరు అంటారు. దాంతోనే ఆయన మీద అందరూ బాణాలు ఎక్కుపెడుతున్నారు.


తాజాగా గంటా పార్టీ మారి తీరుతారు ఇది సత్యం అంటున్నారు ఒకప్పటి ఆయన నేస్తం, ప్రస్తుత వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు. గంటా తప్పకుండా బీజేపీలోకి ఫిరాయిస్తారని బల్ల గుద్ది మరీ అవంతి చెప్పేస్తున్నారు. గంటా  పార్టీ మారడంలో విచిత్రం కూడా ఏదీ లేదని కూడా ఆయనే తేల్చేస్తున్నారు. 


ఇదిలా ఉండగా వైసీపీలో మంత్రిగా ఉన్నా అవంతికి గంటాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. గంటా లోగుట్టు అంతా అవంతికి ఎరుకే అందుకే ఆయన ఇలా చెబుతున్నారని కూడా అంటున్నారు. చూడాలి మాజీ మిత్రుని జోస్యం ఎంతవరకు నిజమవుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: