బడాయి పోవాలంటే ఆ పార్టీయే ముందుంటుంది. అర్భాటాలు చేయాలన్నా వారే తయారు. ఇక హడావుడికి కొదవే లేదు. చెప్పిన మాట చెప్పకుండా చెప్పాలన్నా వారికి సరి సాటి ఎవరూ లేరు. ఆకాశం నుంచి చందమామను దించేశామని చెబితే నమ్మాల్సిందే.


అవును ఇదంతా చంద్రబాబు అండ్ కో గురించే. అమరావతి రాజధాని అన్నారు. అద్భుత నగరం అన్నారు. అక్కడే అన్నీ అన్నారు. తీరా చూస్తే ఈ ఆర్భాటం అంతా ప్రభుత్వ ఆఫీసులోనే. అయిదేళ్ళు పాలించమని అవకాశం ఇస్తే సొంత ఇల్లు కూడా మాజీ సీఎం చంద్రబాబు తాను ఎంతో ప్రేమించిన అమరావతిలో కట్టుకోలేకపోయారు.


ఇక పార్టీ ఆఫీస్ కూడా లేదాయే. అంతా ప్రజావేదికలోనే . అయిదు కోట్లు అంచనా వేసి ఎనిమిది కోట్లుగా నోటి మాటతో పెంచేసి చివరకి దాన్ని పూర్తిగా పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకోవడం అంటే తమ్ముళ్లు ఏ స్థాయిలో బడాయి పొతూన్నారో అర్ధమవుతుంది. ఇపుడు ప్రజావేదిక మాది అంటున్నారు. మరి దాన్ని ఏమైనా టీడీపీ సొమ్ముతో కట్టారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఓటమితో పరువు పోగొట్టుకున్న వారు ఇపుడు మరింతగా దిగజారిపోతున్నారేంటని తమ్ముళ్ళే ఎకసెక్కం ఆడుతున్న పరిస్థితి.


మరింత సమాచారం తెలుసుకోండి: