జగన్ ఓ గట్టి సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. సీఎం గా ప్రమాణం చేసిన దగ్గర నుంచి ఆయన ఆరాటం, ఆత్రుత చూస్తూంటే అదే అనిపిస్తుంది. నిబధ్ధత, కమిట్మెంట్ జగన్ లో ఉన్నాయని వైరి పక్షాలు కూడా అంటున్నారు. ఏదో గాలి మాటలు చెప్పడం జగన్ వల్ల కాదన్నది ఇపుడు అంతా అంగీకరిస్తున్నారు. జగన్  ప్రజల్లో న‌మ్మకం బాగా పెంచుకుంటున్నారు.


దానికి పెద్ద ఉదాహరణ. తాను ఇచ్చిన హామీలను వరసపెట్టి అమలుచేయాలనుకోవడం. అమ్మ ఒడి పధకం చాలా ఖర్చుతో కూడున్న సంగతి తెలిసిందే. ఈ పధకం పై రకరకాల అపోహలు వచ్చాయి. కేవలం కొంతమందికే ఇస్తారని కూడా ప్రచారం చేశారు. అయితే జగన్ క్లియర్ గా చెప్పారు. బడికి పిల్లలను పంపించే ప్రతి పేద తల్లికి ఏడాదికి 15 వేల రూపాయలు స్తామని క్లారిటీ ఇచ్చేశారు. 


దీంతో ఇపుడు టీడీపీ నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. జగన్ ప్రభుత పాఠశాలలకే అంటే దాన్ని రచ్చ చేయాలనుకుంది. అయితే ఇపుడు అందరికీ అమ్మ ఒడి అంటూ సీఎం ఆఫీస్ నుంచి స్పష్టమైన ప్రకటన రావడంతో టీడీపీకి కరెంట్ షాక్ కొట్టినట్లైంది. జగన్ తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసమైనది, నిజంగా గ్రేట్ అంటున్నారు ఆఫ్ ది రికార్డ్ గా టీడీపీ నేతలే. ఇది చాలదా జగన్ జనం ముఖ్యమంత్రి అని చెప్పడానికి.


మరింత సమాచారం తెలుసుకోండి: