ప్రజావేదిక విషయంలో చంద్రబాబునాయుడుకు జగన్మోహన్ రెడ్డి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. రెండు రోజుల తర్వాత కూల్చివేతకు ఆదేశాలివ్వటం చంద్రబాబుకు మింగుపుపడని విషయమే.  ప్రజా వేదికపై జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదికలో రెండు రోజుల కలెక్టర్ల సమావేశాన్ని జగన్ ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. సమావేశం సందర్భంగా జగన్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా కట్టిన ఆ భవనంలోనే కలెక్టర్ల సమావేశం పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు.

 

అక్రమ కట్టడాలపై జగన్ ప్రస్తావిస్తు గత ప్రభుత్వం పనిచేసిన విధానాన్ని ఉదాహరణగా చూపారు. చంద్రబాబునాయుడు హయాంలో చేపట్టిన అక్రమ కట్టడాలు, నిబంధనలకు తూట్లు పొడిచిన విధానం, నియమాలను కాలరాసిన విధానాలను కలెక్టర్ల అందరికీ లైవ్ ఎగ్జాంపుల్ గా చూపటానికే తాను అక్రమ నిర్మాణమైన ప్రజావేదికలో కలెక్టర్ల సామవేశం పెట్టినట్లు జగన్ స్పష్టంగా చెప్పారు.

 

నిబంధనలకు వ్యతిరేకంగా, చట్టాలను ఉల్లంఘిస్తు ప్రభుత్వమే అక్రమ కట్టడాల్ని ప్రోత్సహిస్తే జనాలకు ఎటువంటి సంకేతాలు పంపుతున్నామో ఆలోచించాలంటూ జగన్ చెప్పారు. ఇదే విధమై అక్రమనిర్మాణాన్ని ఇంకెవరైనా నిర్మిస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా ? అంటూ కలెక్టర్లను నిలదీశారు. కాబట్టి అక్రమ నిర్మాణమైన ప్రజావేదికను రెండు రోజుల్లో కూల్చేయాలంటూ అధికారులకు సమావేశంలోనే ఆదేశాలు జారీ చేయటం సంచలనంగా మారింది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: