అనిల్‌ కుమార్‌ !! మీరు సూపర్‌ !!

మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, నెల్లూరు నుంచి అమరావతికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగినట్టు మంత్రి గుర్తించారు. దీంతో, వెంటనే కాన్యాయ్‌ ఆపి.. ప్రమాదంలో గాయపడిని వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.


క్షతగాత్రులను ఎలాగైనా బతికించాలనే తాపత్రయంతో వారిని అతి త్వరగా తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లాలని తన సిబ్బందిని మంత్రి ఆదేశించారు. కానీ అంతకుమందే అక్కడి వారు108కు సమాచారం ఇవ్వడంతో.. ఆ వాహనంలో వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారికి ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందించాలని వారిని ఆదేశించారు.


మంత్రిగారి మానవీయ స్పందనకు ఆ ప్రాంతపు జనం ప్రశంసలు కురిపిస్తున్నారు. కలెక్టర్ల సమావేశంలో పాల్గొనేందుకు అమరావతికి బయలుదేరిన రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, రోడ్డు ప్రమాదాన్ని గమనించి.. గాయపడ్డ వారికి చేయూతనివ్వడం అదర్శనీయం అని నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: