- ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి
ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి నాకు మంచి అనుభవం గల ఉన్నతాధికారుల బృందం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.  విజయవాడలోని బెరం పార్క్ లో  ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ ఆధర్వర్యంలో ఏర్పాటు చేసిన గెట్ టూ గెదర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. 


అనుభవజ్ఞులైన మీ మార్గదర్శకత్వం, సహకారంతో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దగలననే నమ్మకం నాలో కలిగిందన్నారు. ఈ రోజు ఉదయం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నా మదిలో ఉన్న ఆలోచనలు మీ అందరితో పంచుకున్నాను.  మీ ప్రేమను, అభిమానాన్ని చూరగొనడం చాలా సంతోషకరమైన విషయమని ముఖ్యమంత్రి ఆనందాన్ని వ్యక్తం చేశారు.


 ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు మన్మోహన్ సింగ్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి మెమెంటో అందజేసి, శాలువాతో సత్కరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఐఏఎస్ ఉదయలక్ష్మి  ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.  ఈ కార్యక్రమంలో ఐఏఎస్, ఉన్నతాధికారులందరూ పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: