ఏపీకి ప్రత్యేక హోదా అన్నది జీవనాడి. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే హోదాతోనే అన్నీ వస్తాయా. అదేమైనా సంజీవనా అన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తానికి మాటలు మార్చి, యూ టర్న్ తీసుకుని ఆయన చివరికి హోదాని నీరు కార్చేశారు.


ఇపుడు కొత్త ముఖ్యమంత్రి జగన్ హోదా కోసం తన వరకూ పోరాడుతున్నారు. అయితే విపక్షంలో ఉన్న టీడీపీ హోదా రాదు అంటోంది. ఇక జనసేనాని అయితే కేంద్రం మీద నేరం పెట్టకుండా జనంలో హోదా ఆకాక్ష లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా ఉద్యమంలా జనం హోదా కావాలంటూ రోడ్డు మీదకు వస్తే తాను నాయకత్వం వహిస్తానని అంటున్నారు.


కానీ పవన్ తెలుసుకోవాల్సింది నాయకుడే జనాలను నడిపించాలని హోదా ఆన్నది జనంలో బలంగా ఉండబట్టే చంద్రబాబు ఓడిపోయారు. బీజేపీకి నోటా కంటే ఓట్లు తక్కువ వచ్చాయి. ఇప్పటికీ ఏపీలో బీజేపీ పుంజుకోకపోవడానికి హోదా అతి పెద్ద అడ్డంకి. పవన్ ఈ సంగతి గ్రహిస్తే జనాలను వూరికే ఆడిపోసుకోరు.


మరింత సమాచారం తెలుసుకోండి: