కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజా వేదిక భవనాన్ని కూల్చి వేయాలని జగన్ ఆదేశాలు ఇవ్వడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వాగతించారు. అక్రమ నిర్మాణాలు ఎవరు కట్టినా అంగీకరించ కూడదన్నారు. అయితే ఇక్కడే పవన్ జగన్ కు సవాల్ విసిరారు.

 

ప్రజా వేదిక తో పాటు కృష్ణా కరకట్ట పై ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలు కూల్చి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ పని చేస్తే జగన్ ను తాను శభాష్ అంటా ను  అన్నారు. ప్రజా వేదిక కూల్చి వేయాలన్న నిర్ణయం సంచలనం గా మారింది.

 

11 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. దీనిని కూల్చితే దాని ప్రభావం మిగిలిన నిర్మాణాలపై పడుతుంది. కృష్ణా కరకట్ట పై బడా బాబులు ఎందరో గెస్ట్ హౌస్, ఆశ్రమాలు కట్టుకున్నారు. వాటి జోలికి పోకుండా కేవలం ప్రజా వేదికనే కూల్చితే కచ్చితంగా విమర్శలు వస్తాయి.

 

మరి కరకట్టపై ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను జగన్ నేలమట్టం చేస్తాడా.. అదే జరిగితే.. అదో పెద్ద తేనె తుట్టే అవుతుంది. మరి జగన్ ఏం చేయ దలుచుకున్నారో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: