ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కుటుంబం విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చింది.  పాపం పేరు విదేశీ పర్యటన అనే గాని చంద్రబాబుకు అక్కడ ఏ మాత్రం  అంతట ప్రశాంతత దక్కలేదు.  తెలుగుదేశం ఎంపీలు పార్టీ మారడం,  ఇతర నేతల జంపింగ్ లతో చంద్ర బాబుకు  పార్టీ మేనేజ్మెంట్ సరిపోయింది.

 

ఇంతా చేసి విదేశాల నుంచి తిరిగి రాగానే ఇక్కడ ఏపీ సీఎం జగన్ చంద్రబాబు ఫ్యామిలీకి మరో షాక్ ఇచ్చారు.  అదేంటంటే..  చంద్రబాబు కుటుంబానికి ఉన్న సెక్యూరిటీ బాగా తగ్గించి వేశారు.  గతంలో లోకేష్ కు ఫోర్ ప్లస్ ఫోర్  సెక్యూరిటీ ఉంటే...  ఇప్పుడు దాన్ని  టు ప్లస్ టుకు  కుదించారు.

 

అంతేకాదు..  చంద్రబాబు ఫ్యామిలీ లోని మిగిలిన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ  సెక్యూరిటీ ని పూర్తిగా ఎత్తివేశారు.  ఫారిన్ నుంచి ఏపీ లో అడుగుపెట్టిన చంద్రబాబు ఫ్యామిలీ కి ఎయిర్పోర్టులోనే ఈ  సెక్యూరిటీ షాక్ తగిలింది.  చంద్రబాబు ఫ్యామిలీకి సెక్యూరిటీ తగ్గించడం పై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు.

 

కనీస సమాచారం ఇవ్వకుండా ఇలా సెక్యూరిటీని  ఎలా తగ్గిస్తారని  ప్రశ్నిస్తున్నారు.  జగన్ ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆయన రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: