విజయవాడ నగరానికి మచ్చగా మారిన కాల్ మనీ, సెక్స్ రాకెట్  ఉదంతాల పై సీఎం జగన్  సంచలన వ్యాఖ్యలు చేశారు.  విజయవాడ మహానగరంలో ఎలాంటి దారుణాలు చేసుకోవడం ఏ మాత్రం సహించబోనని జగన్ అన్నారు. కాల్ మని, సెక్స్ రాకెట్ వ్యవహారాల్లో ఏ  పార్టీ నేతలు  ఉన్నా ఉపేక్షించ వద్దని  పోలీసులను ఆదేశించారు.

 

ఉండవల్లిలోని ప్రజావేదిక లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సు రెండో రోజు జగన్ శాంతిభద్రతలకు భద్రతలపై  సమీక్ష నిర్వహించారు.  కాల్ మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారంపై ఫిర్యాదు  ఉంటే  చర్యలు తీసుకోవాలని  పోలీసులను ఆదేశించారు.  ఈ విషయంలో పార్టీలకు అతీతంగా పోలీసుల చర్యలు ఉండాలని  జగన్ అన్నారు.

 

విజయవాడ లోనే ఈ కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో టీడీపీ హస్తం ఉందని  గతంలో చాలా విమర్శలు వచ్చాయి.  ఇప్పుడు జగన్ ఆదేశాలతో  ఆ బండారాన్ని  బట్టబయలు చేసే అవకాశం ఉంది.   ఏమైనా  కాల్ మనీ వంటి ఉదంతాలు మళ్లీ జరగకూడదంటూ  జగన్ పోలీసులకు గట్టిగానే చెప్పేశారు.  ఇక పోలీసులు ఎంతవరకు చర్యలు తీసుకుంటారో  వేచి చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: