ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ దారుణమైన ఫలితం పొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు.  ఈ నేపథంలో ఆయన వరుస సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఉన్న భద్రతను కుదించిన ఏపీ సర్కారు, ఇప్పుడు మాజీ మంత్రి లోకేశ్ భద్రతనూ తగ్గించింది. 

మొన్నటి వరకు లోకేష్ బాబు కి 5+5 గన్ మెన్లు ఉండగా..ఆ స్థానంలో 2+2 కి కుదించారు.  ఇక చంద్రబాబు కుటుంబీకుల్లో ఆయన సతీమణి భువనేశ్వరికి కోడలు బ్రాహ్మిణికి భద్రత కి పూర్తిగా తొలగించారు.  తాజాగా తమ అధినేతకు భద్రత తగ్గించడం..ఆయన కుటుంబీకులకు భద్రత పూర్తిగా తొలగించడంపై  లుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే గన్ మెన్లను వెనక్కు తీసుకున్నారని ఆరోపించారు. గతంలో టీడీపీ పాలనలో ఉండగా  వైసీపీ నాయకులపై ఏ మాత్రం పక్షపాతం చూపలేదని, జగన్ పాదయాత్రకు సైతం పూర్తి స్థాయి భద్రత కల్పించామని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: