బీజేపీ ఆపరేషన్ ఆంధ్రా ముమ్మరం చేసింది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీ లో అధికారం దిశగా పావులు కదుపుతోంది. అధికారం కల సాకారం కాకపోయినా.. కనీసం ప్రతి పక్షం గా నైనా ఉనికిలో ఉండాలని ఎత్తులు వేస్తోంది.

 

ఇందులో భాగంగానే ఇప్పటికే నల్గురు టీడీపీ ఎంపీ లను పార్టీ లో చేర్చేసుకుంది. కాదు..కాదు.. ఏకంగా విలీనం చేసుకుంది. ఇప్పుడు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నేతలపై దృష్టి పెట్టింది. ప్రత్యేకించి ఒక బలమైన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసింది.

 

ఈ ఉపాయం వర్క్ అవుట్ అయితే.. టీడీపీ ఫూరా ఖాళీ కావడం ఖాయం. టీడీపీ లోని ప్రముఖ నేతలతో పాటు.. పార్టీలో ని ద్వితీయ శ్రేణి నాయక త్వం కూడా బీజేపీ వైపు చూస్తోంది. అసలే ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన టీడీపీ ఇపుడు పార్టీని కాపాడు కోవడం అసలు సిసలైన అగ్ని పరీక్ష. ఈ పరిస్థితిని కళ్ళకి కట్టేదే పైన ఉన్న వ్యంగ్య చిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: