అక్రమ కట్టడాలను కూల్చేయలని జగన్ ఆదేశించడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  మరి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఇలాంటి కట్టడాలు అధికంగా ఉన్నాయి. దీంతో.. నిర్మాణాల్నికూల్చివేత సాగితే తమ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తూర్పుగోదావరి జిల్లా గోదావరి పరీవాహన ప్రాంతాల్లో కరకట్ట లోపల అనేక నిర్మాణాల్ని నిర్మించారు. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారు.


వాస్తవానికి..నదికి.. కరకట్టకు మధ్య ఎలాంటి కట్టడాలు నిర్మించకూడదు. చాలా కాలం అధ్యాత్మికం.. టూరిజం పేరుతో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. రాజమహేంద్రవరంలో చూస్తే.. ఇస్కాన్ టెంపుల్.. రివర్ బే.. టూరిజం కార్యాలయం.. చాంబర్ భవనం.. అయ్యప్ప గుడి.. కైలాసభూమి.. ఇటీవల నిర్మించిన మరో కొత్త గుడితో పాటు.. సరస్వతీ జ్ఞాన సరస్వతీ దేవాలయం నిర్మాణంలో ఉంది.


ఇవి కాకుండా ధవళేశ్వరం సమీపంలోని లంకల్లోనూ ఇదే రీతిలో పక్కా భవనాలు ఉన్నాయి.ప్రస్తుతం ప్రస్తావించిన భవనాల్లో చాలావరకూ అనుమతులు లేకుండా నిర్మించేశారు. అక్రమ నిర్మాణాలపై రాజీ లేదని. . కూల్చివేయటం మినహా మరో మార్గం లేదంటూ.. మాజీ ముఖ్యమంత్రి వినియోగించిన భవనాన్నే కూల్చేస్తున్న వేళ.. తమ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి: