తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే.  రాష్ట్రాభివృద్ది సాధించే క్రమంలో పార్టీ కార్యాలయాల ద్వారా ఆయా ప్రాంతాల ప్రజల ఇబ్బందులు వెంటనే పరిష్కరించడానికి పార్టీ బలోపేతం చేయడానికి ఈ కార్యాలయాల నిర్మాణం జరుగుతుంది.  ఆర్ఎస్ ఆఫీసులు ఇకపై సొంత స్థలాల్లో, సొంత భవనాల్లో కొలువుదీరనున్నాయి.


ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల నిర్మాణం మొదలైంది. ఇందుకు సంబంధించిన ఈ నెల 24న పార్టీ ఆఫీసులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ టీఆర్ఎస్ పార్టీకి తనవంతు విరాళంగా తన నెలజీతాన్ని అందించారు. నెలజీతం రూ.2,50,000 చెక్కును సుమన్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అందించారు.


ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ..బాల్కన్ సుమన్ తెలంగాణ పోరాట సమయం నుంచి టీఆర్ఎస్ కి ఎంతో విధేయులుగా ఉంటున్నారని..అందుకే ప్రజలు ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించి తమ మద్దతు పలికారని..అందుకు అనుగుణంగా ఆయన కూడా తెలంగాణ అభివృద్దిలో భాగస్వామ్యులు అవుతారని,  పార్టీ ఆఫీసుల నిర్మాణం కోసం ముందుకొచ్చిన సుమన్ ను ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: