ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకువెళ్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగులకు మరో తీపికబురు అందించారు. గ్రామ వాలంటీర్లు కాకుండానే మరో లక్షన్నరకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నారు.

 

ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో పదేసి చొప్పన ఉద్యోగాలను కొత్త వాళ్లతోనే భర్తీ చేస్తామని ఏసీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్ల సదస్సులో మరోసారి స్పష్టం చేశారు. దీంతో మొత్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు కలిపి దాదాపు లక్షన్నర మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశముందన్నారు.

 

ఇకపోతే వాలంటీర్లు తమకు కేటాయించిన 50 కుటుంబాల నుంచి తీసుకువచ్చే వినతులను 72 గంటల్లో సంబంధిత శాఖలను సంప్రదించి పరిష్కరించడమే పదేసి మంది ఉద్యోగుల ప్రధాన కర్తవ్యం. అలాగే రైతులకు నాణ్యమైన విత్తనాలు లభ్యమయ్యేలా చూసుకోవడం కూడా వీరి విధుల్లో భాగంగానే ఉంటుంది. కాగా జగన్ ప్రభుత్వం కనీసం రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయనుంది.

 

మరోవైపు గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా http://gramavolunteer.ap.gov.in పేరిట వెబ్‌ సైట్‌ ఏర్పాటు చేసింది. 18-35 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నియామకాల్లో రిజర్వేషన్లను పాటిస్తారు. 50 శాతం ఉద్యోగాలను మహిళలకు కేటాయించడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: