తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ లో  చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ లో చేరుతున్న వారిలో టీడీపీ  అధినేత చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ సన్నిహితులు  బంధువులు  కూడా ఉండడం పార్టీ క్యాడర్ ను విస్మయానికి గురి చేస్తోంది . బాలకృష్ణ సమీప బంధువు ఒకరు నేడు  కాషాయ కండువా కప్పుకోవడం హాట్ టాఫిక్ గా మారింది  . బాలయ్య సమీప బంధువు పొట్లూరి కృష్ణబాబు తన భార్య తో కలిసి బీజేపీ  జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షం లో ఆ పార్టీ లో చేరారు.


మాజీ ఎమ్మెల్యే , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అంబికా కృష్ణ,  బీజేపీ లో చేరిన మరుసటి రోజే,  పొట్లూరి కృష్ణబాబు కూడా పార్టీ మారడం యాదృశ్చికమా ?, లేకపోతే , దీనివెనుక ఏదైనా కుట్ర ఉందా ?? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . అంబికా కృష్ణ కూడా బాలయ్య కు అత్యంత సన్నిహితుడు కావడమే కాకుండా , పార్టీ వీడే విషయాన్ని  తాను బాలకృష్ణ కు చెప్పినట్లు ఆయన పేర్కొనడం… అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుందన్న వాదనలు విన్పిస్తున్నాయి .


అయితే తన సన్నిహితులను, సమీప బంధువులను బాలయ్య నే బీజేపీ లోకి పంపారన్నది అర్థరహితమైన వాదన అని తెలుగు తమ్ముళ్లు కొట్టి పారేస్తున్నారు . కాకపోతే పార్టీ కష్టకాలం లో ఉన్న సమయం లో బాలయ్య సన్నిహితులు , బంధువులు గోడ దూకితే ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలు వెళ్తాయో తెల్సిందేనని పరోక్షంగా తన సన్నిహితులు , బంధువులను కూడా పార్టీ మారకుండా బాలయ్య కట్టడి చేయలేకపోయారంటూ ఎద్దేవా చేస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: