బీజేపీ నేత లక్షణ్ గౌడ్ నివాసంలో పేలుడు కలకం సృష్టించింది. నగరంలోని బర్కత్పూర, నల్లకుంట డివిజన్, రత్నానగర్లో బీజేపీ నాయకుడు లక్ష్మణ్ గౌడ్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. గ్యాస్ సిలిండర్ పేలుడంతో ఇంటి పైకప్పు లేచిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనా స్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. గ్యాస్ సిలిండర్ ఎందుకు పేలిందన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
కాగా, ఈ మద్య తెలంగాణలో బీజేపీ బలం బాగా పుంజుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపత్యంలో బీజేపీ ముఖ్య నేతలపై కొంత మంది కన్ను ఉందని..వారికి భద్రత ఏర్పాటు చేయాలని బీజేపీ శ్రేణులు కోరారు.