చూడబోతే అలాగే ఉంది వాళ్ళ మాటలు చూస్తుంటే. కరకట్టపైన అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూల్చేసింది. దాన్ని జీర్ణించుకోలేకపోతున్న టిడిపి నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళేం మాట్లాడుతున్నారో అసలు వాళ్ళకే తెలియటం లేదు.

 

కూల్చివేతల నేపధ్యంలో ప్రజావేదికను కూల్చేయటం తుగ్లక్ చర్యగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అంతటి సీనియర్ వ్యాఖ్యలు చేయటమే విచిత్రంగా ఉంది. పైగా టిడిపి నిర్మించిందని పోలవరం ప్రాజెక్టును కూడా కూల్చేస్తారా ? అంటూ మతిలేని మాటలు మాట్లాడుతున్నారు.

 

ఇక మరో నేత పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ విజయవాడలో కొన్ని వేల అక్రమ నిర్మాణాలున్నాయి. వాటిని కూడా కూల్చేస్తారా ? అంటూ జగన్ ను ప్రశ్నిస్తున్నారు. బుద్ధా వెంకన్న మాట్లాడుతూ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ నివాసం కూడా అక్రమ నిర్మాణమే అంటూ మండిపడుతున్నారు. తన నివాసాన్ని కూలగొట్టుకుంటే అక్రమ నిర్మాణాల కూల్చివేతలో జగన్ చిత్తశుద్దిని టిడిపి ఒప్పుకుంటుందనే వితండ వాదాన్ని లేవనెత్తారు.

 

పోలవరం ప్రాజెక్టునూ  కూల్చివేస్తారా అన్న యనమల ప్రశ్నకు అర్ధమే లేదు. ఎందుకంటే, పోలవరం ఏమీ అక్రమ నిర్మాణం కాదు. పైగా టిడిపి నిర్మించిందని జగన్ కూల్చేయటం లేదు ప్రజావేదికను. నిర్మాణాలు చేయకూడని ప్రాంతంలో అక్రమంగా నిర్మించారనే మొదటినుండి జగన్ చెబుతున్నది. విజయవాడలోని అక్రమ నర్మాణాల గురించి పయ్యావుల మాట్లాడటంలో అర్ధమేలేదు.

 

ఎందుకంటే విజయవాడలో అక్రమ నిర్మాణాలున్నా అవేవీ నిర్మాణాలు చేయకూడని ప్రాంతాల్లో లేవు. పైగా అక్రమ నిర్మాణాలను సక్రమ నిర్మాణాలుగా చేసుకునేందుకు గత ప్రభుత్వాలే అవకాశాలిచ్చాయి. ఇపుడు టిడిపి అక్కసంతా ఏమిటంటే తమ పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు అనువుగా ఉన్న ప్రజావేదికను ప్రభుత్వం కూల్చేసిందనే.  చూస్తుంటే జగన్ దెబ్బకు టిడిపి నేతల మైండ్ బ్లాంక్ అయినట్లే అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: