2019 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ 151 సీట్లతో ప్రభంజనం సాధించింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణం చేసిన రోజు నుండి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నవరత్నాల్లోని హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వాల్లా కాకుండా ఇచ్చిన హామీల అమలును వేగవంతంగా పూర్తి చేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డిగారు. 
 
సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పాలన చూసి ప్రతిపక్షాలే ఆశ్చర్యపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలు అధికారులు, నిరుద్యోగులు, కార్మికులు, మహిళలు అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ సమయంలో అందరినీ సంతృప్తి పరిచేలా ఇన్ని నిర్ణయాలు తీసుకోలేదు. 
 
ప్రతిపక్షమైన తెలుగుదేశం నామమాత్రంగా విమర్శలు చేస్తున్నప్పటికీ ఆ విమర్శల్ని ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు. జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొంతకాలం చూసిన తరువాత విమర్శలు చేస్తానని చెప్పాడు. కానీ జగన్ పరిపాలనను చూస్తుంటే టీడీపీ, జనసేన పార్టీలకు విమర్శించే అవకాశం వచ్చేలా మాత్రం లేడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: