చంద్రబాబునాయుడు అరాచకాలు ఒక్కోటే బయటపడుతున్నాయి. సిఎంగా ఉన్నంత కాలం తాను చేసిన దురాగతాలు ఏవీ బయటకు రాకుండా కప్పెట్టేసిన చంద్రబాబు ఇపుడు అవి బయటపడుతుంటే తలలు పట్టుకుంటున్నారు. అక్రమ నిర్మాణమైన ప్రజావేదికను కూలగొట్టేసిన నేపధ్యంలో చంద్రబాబు మరో ఆక్రమణ బయటపడింది.

 

అక్రమ నిర్మాణమైన  లింగమనేని గెస్ట్ హౌస్ లో నివాసముంటున్న చంద్రబాబు దానికి వేసుకున్న రోడ్డు కూడా ఓ రైతుదట. అంటే ఎవరిదో రైతు పొలాన్ని ఆక్రమించుకున్న చంద్రబాబు ఆ పొలంలో నుండే రోడ్డు వేసుకున్నారట. పొలం ఇవ్వటానికి రైతు ఒప్పుకోకపోయినా వినకుండా బలవంతంగా సేకరించి రోడ్డు వేసేసుకున్నారంటూ తాజాగా సదరు రైతు మీడియా ముందుకొచ్చారు.

 

అంటే ప్రజావేదికకు వెళ్ళే మార్గం, లింగమనేని గెస్ట్ హౌస్ కు వెళ్ళే దారి ఒకటే కావటంతో ధౌర్జన్యంతో రైతు పొలం లాగేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ద్వారా రోడ్డు వేయించేసుకున్నట్లు అర్ధమవుతోంది. చంద్రబాబు తమను బెదిరించి ఎలా తమ పొలాన్ని లాగేసుకున్నది వివరించి దస్తా వేజులతో సహా రుజువులు చూపిస్తున్నారు.

 

ప్రజావేదికను కూల్చేసిన నేపధ్యంలో రోడ్డేసిన తమ పొలాన్ని తమకు ఇప్పించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు డిమాండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం గనుక వాళ్ళ పొలాన్ని వాళ్ళకు వాపసు ఇచ్చేట్లయితే తన ఇంటికి వెళ్ళటానికి చంద్రబాబుకు రోడ్డు కూడా ఉండదు. మొత్తానికి చంద్రబాబుకు ఎంత దరిద్రం పట్టుకున్నదో అర్ధమైపోతోంది. చూడబోతే చంద్రబాబుకు తన నివాసాన్ని కూడా ఖాళీ చేయక తప్పేట్లు లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: