చంద్రబాబునాయుడుకు మీడియా బేబీ అని ముద్దు  పేరు. ఆయన ఎక్కడ అవకాశం దొరికినా మీడియా మైకులు చూస్తే చాలు అక్కడే నిలబడిపోతారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా బాబుకు మీడియా ఫోబియా అలాంటిది మరి. కానీ ఇపుడు చిత్రమేంటంటే పవర్ పోయి నెల రోజులైనా కూడా బాబు మీడియాకు ముఖం చూపడమేలేదు.


ఇక ఓ వైపు బాబు కలల నగరం రాజధానిలో సుందర స్వప్నం ప్రజా వేదికను కూల్చేశారు. మరి పక్కనే ఇంట్లో ఉన్నా కూడా బాబు ఎటువంటి సౌండ్ చేయలేదు. కాదు చేయాలనుకున్నా చేయలేని పరిస్థితిలో పడ్డారు. అర్ధరాత్రి ఉండవల్లి ఇంటికి చేరుకున్న బాబు హైకోర్ట్లు మోషన్  పిటిషన్ తీర్పు  కోసం చూశారు. అయితే అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో గమ్మునుండిపోయారు. పైగా తాను అక్రమ కట్టడం నిర్మించానని బాబుకు, తమ్ముళ్ళకు కూడా తెలుసు. 


దానికి తోడు ఒక్క రాజకీయ పార్టీ కూడా మద్దతుగా మాట్లాడలేదు. ఇక జనంలో కూడా కూల్చడమే బెటర్ అన్న భావన రావడంతో బాబు గారు ఆశించిన సానుభూతి రాలేదు. దాంతో చేసేది లేక ఇక ఉండవల్లి ఇంటిని కూడా ఖాళీ చేయడానికే బాబు గారు డిసైడ్ అయిపోయారు. ఓ విధంగా అధికార పార్టీని విమర్శించే అవకాశం ప్రతిపక్షానికి ఎపుడూ ఉంటుంది. కానీ జగన్ అటువంటి చాన్సే ఎక్కడా ఇవ్వడంలేదు. దాంతో బాబు గారి నుంచి సౌండ్ వస్తే ఒట్టు.



మరింత సమాచారం తెలుసుకోండి: