దారుణమైన పరాజయాలు కాదు కానీ తెలుగుదేశం పార్టీ లోగుట్టు ఏంటో బయటపడిపోతోంది. పైన పటారం, లోన లోటారంలా పార్టీ మారిపోయింది. ఆ పార్టీలో ఎంతటి అసమ్మతి, అసంత్రుప్తులు ఉన్నాయో కూడా తెలిసివస్తోంది. లోకానికే కాదు అధినేతకూ అసలు విషయాలు అర్ధమవుతున్నాయి.


టీడీపీలో అధికార పార్టీ ప్రతినిధిగా ఉంటూ బలమైన వాదనను పార్టీ తరఫున వినిపించే విజయవాడకు చెందిన లంకా దివాకర్ సైకిల్ దిగిపోయారు. ఆయన బీజేపీలో చేరిపోయారు. టీడీపీ బ్రష్టుపట్టిపోయిందని దారుణమైన కామెంట్స్ ఆయన చేశారు. టీడీపీ ఇక బాగుపడని కూడా తేల్చిచెప్పారు.


అధినేత చంద్రబాబు చెప్పుడు మాటలు విని పార్టీని పాడుచేశారని కూడా హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ కోసం పనిచేసేవారెవరో కూడా గుర్తించలేనంత నిస్సహాయ స్థితిలో పార్టీ పడిపోయిందని ఆయన అన్నారు. నలభయ్యేళ్ళు తమ కుటుంబం సేవ చేసినా పార్టీలో గుర్తింపు లేదని లంక దివాకర్ అన్నారు. మొత్తానికి టీడీపీకి గొంతుక లాంటి దివాకర్ బీజేపీలో చేరడం ఆ పార్టీకి భారీ  నష్టమే.



మరింత సమాచారం తెలుసుకోండి: