ఓడలు బళ్ళు అవుతాయి.. బళ్ళు ఓడవుతాయి అంటే ఇదే.  బాబుగారి విషయంలో ఇది నిజం అయ్యింది.  జగన్ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నాడని.. అది జరగదని చెప్పిన బాబు గారి మాట రివర్స్ అయ్యింది.  భారీ మెజారిటీతో జగన్ విజయం సాధించి అధికారంలోకి వచ్చాడు. 

వచ్చిన తరువాత తనదైన శైలిలో పాలన చేస్తూ.. చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నాడు.  నిర్ణయాలు అమలు చేయడంలో దూసుకుపోతున్నాడు.  ముఖ్యంగా అక్రమ కట్టడాల విషయంలో జగన్ చాలా సీరియస్ గా ఉన్నాడు.  తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నాడు. 


బాబుగారి ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రజావేదిక అక్రమంగా కట్టింది అని చెప్పి దానిని కూల్చివేశారు. దాదాపుగా ఈ పనులు పూర్తయ్యాయి. కరకట్టపై ఉన్న బాబుగారి ఇంటిపై కూడా జగన్ దృష్టిపెట్టారు.  లింగమనేని ఎస్టేట్ లోని ఇల్లు కూడా అక్రమంగా నిర్మించిందే అని చెప్పి దానిని కూడా కూల్చివేసేందుకు సిద్ధం అయ్యాడు.  


దీంతో బాబుగారు మరో ఇల్లు కోసం వెతుకులాట మొదలుపెట్టారు.  ఎట్టకేలకు ఇల్లు దొరికింది.  మంగళగిరి లోని కామినేని హాస్పటిల్ కు ఎదురుగా ఉన్న గ్రావెల్ ఇండియా భవనంలో బాబుగారు ఉండబోతున్నట్టు సమాచారం.  అంతేకాదు, బాబుగారు ప్రభుత్వంలో చేసిన అవినీతిపై కూడా జగన్ దృష్టి పెట్టారు.  మరి ఏం జరుగుతుందో చూద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: