మీ బాబు, మా బాబుపై 26 కమిటీలు వేశారు. అవినీతి ముద్రవేయాలని అడ్డదారులు తొక్కారు. చివరికి ఆయన తరం కాలేదు. ఇప్పుడు మీ తరమూ కాదు. వంశధారపై మీరు వేసిన కమిటీ రూపాయి అవినీతి జరగలేదని నివేదికిచ్చింది. ఇవి తాజాగా చినబాబు నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు.
చూస్తుంటే ఓటమి దెబ్బతో
కుంగిపోయిన నారావారి పుత్రరత్నం నారా లోకేష్ సిఎం జగన్మోహన్ రెడ్డిని రెచ్చ
గొడుతున్నట్లే ఉంది. అక్రమ నిర్మాణం ప్రజావేదికను జగన్ కూల్చేయటాన్ని
జీర్ణించుకోలేని లోకేష్ సిఎంను బాగా కెలుకుంటున్నట్లే ఉంది. ఎందుకంటే
చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై జగన్ ఇప్పటికే అనేక కమిటీలు
వేశారు.
ఆ విషయాన్నే ట్విటర్ ద్వారా జగన్ ను ఎద్దేవా చేస్తు ట్విట్టర్లో పోస్టు పెట్టారు. మీ బాబు, మా బాబుపై 26 కమిటీలు వేశారు. అవినీతి ముద్రవేయాలని అడ్డదారులు తొక్కారు. చివరికి ఆయన తరం కాలేదు. ఇప్పుడు మీ తరమూ కాదు. వంశధారపై మీరు వేసిన కమిటీ రూపాయి అవినీతి జరగలేదని నివేదికిచ్చింది అంటూ ఎద్దేవా చేశారు.
నిజానికి అప్పట్లో చంద్రబాబు అవినీతిపై వైఎస్ విచారణ చేయించింది వాస్తవమే. కానీ తెరవెనుక జరిగిన వ్యవహారాల వల్ల చంద్రబాబు బయటపడ్డారు. కానీ ఇప్పటి పరిస్దితి వేరు. జగన్ వేరు వైఎస్ వేరన్న విషయాన్ని లోకేష్ మరచిపోయినట్లున్నారు. అలాగే అప్పటి అవినీతి వ్యవహారాలు వేరు ఇప్పటి అవినీతి విచారణ స్టైలు వేరు. కాబట్టి జగన్ గనుక గట్టిగా పట్టుబడితే చంద్రబాబు ఎక్కడో ఓ చోట దొరక్కపోడు.
అవినీతి చేయటంలోను, దొరక్కుండా తప్పించుకోవటంలోను ఎవరి స్టైల్ వారికుంటుంది. కానీ ఒక్కోసారి ఎంతపెద్ద నిపుణులైనా దొరికిపోక తప్పదు. ఇపుడు చంద్రబాబు పరిస్దితి కూడా అలాగే ఉంది చూడబోతుంటే. లోకేష్ తీరు చూస్తుంటే చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై జగన్ మరింత కసితో పనిచేసేట్లు ప్రోత్సహిస్తున్నట్లే ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం.